HomeNewsAndhra Pradeshసింహాద్రి అప్పన్న సేవలో హీరో విజయ్ దేవరకొండ

సింహాద్రి అప్పన్న సేవలో హీరో విజయ్ దేవరకొండ

Published on

సినీ సెలబ్రిటీస్ ప్రముఖ ఆలయాలను చుట్టేస్తున్నారు.మూవీ సక్సెస్ తో ఒకరు విడుదలవుతున్న విజయవంతం కావాలని మరోకరు ఇరు ప్రముఖులందరూ దైవసన్నిదిలో గడిపేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్‌ తన మూవీ జవాన్ మూవీ సక్సెస్ కావాలని మూవీ టీమ్తో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.వీఐపీ దర్శన సమయం లో షారుఖ్ ఖాన్‌ తన కుమార్తె సుహాన ఖాన్తో, సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుప తి దేవస్థానం అధికారులు.. వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న జవాన్ మూవీ సక్సెస్ కావాలని షారు ఖ్ ఖాన్‌ శ్రీవారికి పూజలు చేసి మొక్కు లు చెల్లించారు.మరోవైపు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ విశాఖ సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ నర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ మూవీతో ఫామ్‌లోకి వచ్చి హిట్ టాక్‌తో అందు కున్న సందర్బంగా సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Latest articles

More like this