HomeBusinessRBI గుడ్ న్యూస్… 2వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు

RBI గుడ్ న్యూస్… 2వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు

Published on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2వేల నోట్ల మార్పిడికి గడువును పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అక్టోబర్ 7వ తేదీ వరకూ గడువును పెంచింది ఆర్బీఐ… గడువు తేదీలోగా సమీప బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపిన ఆర్బీఐ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. రూ.2వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోపు మార్చుకోవాలని వినియోగదారులకు సూచించింది.ఈ గడువును ప్రస్తుతం వారం రోజుల పాటు పెంచింది.

Latest articles

More like this