HomeNewsAndhra Pradeshఉద్యోగులకు టీటీడీ బంపర్ ఆఫర్… పాలకమండలిలో కీలక నిర్ణయాలు

ఉద్యోగులకు టీటీడీ బంపర్ ఆఫర్… పాలకమండలిలో కీలక నిర్ణయాలు

Published on

టీటీడీ ఉద్యోగులకు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి శుభవార్త వినిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మంగళవారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పాలకమండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.టీటీడీలో అర్హత ఉనన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాంట్రాక్ట్, కార్పోరేషన్ పరిధిలో ఉన్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యులరైజ్ చేస్తాం ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6850 చెల్లిస్తాం అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసేందుకు పాలకమండలి అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తామని పాలకమండలి ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ నుంచి అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. హోమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తామని.. హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యి రుపాయాలు చెల్లించి టిక్కెట్టు పొందవలసి ఉంటుందని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25.67 కోట్లు కేటాయిస్తున్నామని.. ఈ సొమ్మును తిరిగి ఉద్యోగులు నుంచి రీఎంబర్స్ చేసుకుంటామని చెప్పారు. టీటీడీలో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలం కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు.

తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు రూ.6.15 కోట్లు కేటాయించామన్నారు టీటీడీ ఛైర్మన్. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6850 చెల్లిస్తాం.ప్రసాదాలు, ముడిసరుకులు నిల్వ ఉంచడానికి రూ.11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మాణం.మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు కేటాయింపు.ఎంఆర్‌పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.4.5 కోట్లు కేటాయింపు.పుదిపట్ల జంక్షన్ నుంచి వకులమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణంకు రూ.21 కోట్లు కేటాయింపు.ఆయుర్వేద హాస్పిటల్‌లో రూ.1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం.రుయాలో టిబి రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు నిర్మాణం.స్విమ్స్‌లో రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం.స్విమ్స్‌లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్‌ల ఏర్పాటుకు రూ.74 కోట్లు కేటాయింపు.

స్విమ్స్‌లో రూ.197 కోట్లతో నూతన ఆధునాతమైన భవనాలు నిర్మాణం.నడకదారిలో భక్తుల భధ్రత కోసం రూ.3.5 కోట్ల వ్యయంతో ట్రాప్ కెమరాలు కోనుగోలు.కరీంనగర్‌లో పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్లు కేటాయింపు.అన్నదానంలో పని చేస్తున్న 528 మంది కాంట్రాక్టు సిబ్బంది మరో మూడు నెలలు పాటు కొనసాగింపు.జీతభత్యాలు ఇచ్చేందుకు రూ.2.40 కోట్లు కేటాయింపు.ఆరోగ్యం విభాగంలో పని చేస్తున్న 1694 మంది కాంట్రాక్టు సిబ్బంది మరో ఏడాది పాటు కొనసాగింపు.. జీతభత్యాలు ఇచ్చేందుకు రూ.3.40 కోట్లు కేటాయింపు.తిరుమలలోని ఎఫ్ఎంఎస్ సేవలు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏడాది పాటు పొడిగింపు..ఎఫ్ఎంఎస్ సౌత్, ఈస్ట్ ప్యాకేజీ కోసం రూ.23 కోట్లు కేటాయింపు.గ్రేడ్ 1 హోదాలో పని చేస్తున్న ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి..మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి పద్మావతి ఫ్లోర్ మిల్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15.12 కోట్లు కేటాయింపు.నారాయణాద్రి ఆస్పత్రి నుంచి తిరుచానూరు హైవే వరకు రోడ్డు నిర్మాణానికి రూ.13.29 కోట్లు కేటాయింపు.హీరోహోండా షో రూమ్ నుంచి గ్రాండ్ రిడ్జి హోటల్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.11 కోట్లు కేటాయింపు.అన్నమయ్య మార్గం నుంచి రెండవ సత్రం వరకు అభివృద్ధి పనులకు గాను రూ. 4.89 కోట్లు కేటాయింపు.ప్రాచీనకళలు ప్రోత్సహించడానికి కలంకారి, శిల్పకళలు కోసం సాయంకాలం కోర్సులు ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Latest articles

More like this