HomePolitics13 అంశాలు.. 42 పేజీలతో టీకాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

13 అంశాలు.. 42 పేజీలతో టీకాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Published on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 రోజులే ప్రచారం గడువు మిగిలి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్‌లెట్‌ ‘అభయ హస్తం’ను విడుదల చేశారు. అభయ హస్తంలో 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం 42 పేజీలతో ఉంది టీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి‌‌,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉన్నాయి.

  • వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌
  • తెలంగాణ ఉదమ్యకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.. గౌరవ భృతి
  • తొలి కేబినెట్‌లో మెగా డీఎస్సీపై నిర్ణయం.. మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు
  • గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం..రేషన్‌ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్‌..ప్రతి ఏటా రైతు భరోసా..రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు..వరి క్వింటాలుకు రూ.500 బోనస్‌
  • వ్యవసాయ కూలీలకు ఏడాది రూ.12,000..ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌..చేయూత పింఛన్‌ రూ. 4,000..ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి రూ.5 లక్షలు..విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు
  • కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ
  • మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఖాతాలోకి
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం… విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్‌
  • వైద్య రంగం బడ్జెట్‌ పెంపు
  • ధరణి పోర్టల్‌ రద్దు.. ఆ స్థానంలో భూమాత పోర్టల్‌
  • రేషన్‌ ద్వారా సన్న బియ్యం
  • ఆర్టీసీ విలీన‍ ప్రక్రియ పూర్తి చేయడం
  • రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
  • ఎన్నారై సంక్షేమ బోర్డు
  • దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌
  • ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  • ప్రతీ మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌.
  • చేయూత పెన్షన్‌ రూ.4వేలు
  • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల ఖాతాలో రూ.2500
  • రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌
  • నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం
  • ఖమ్మం, ఆదిలాబాద్‌ నూతన విశ్వవిద్యాలయాలు
  • కొత్త రేషన్‌ కార్డులు జారీ
  • ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల సాయం
    పోటీ పరీక్షలకు ఫీజు రద్దు
  • సీఎం కార్యాలయంలో ప్రతీరోజు ప్రజా దర్బార్‌.. ఇలా ఇంకా ఉన్నాయి..
    ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు… పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’ అన్నారు.

Latest articles

More like this