HomePoliticsకంటోన్మెంట్ బరిలో వెన్నెల.. గద్దర్ కూతురికి అవకాశం

కంటోన్మెంట్ బరిలో వెన్నెల.. గద్దర్ కూతురికి అవకాశం

Published on

తెలంగాణలో ఎన్నికల వేళ హాట్ సీటుగా మారిన కంటోన్మెంట్ టికెట్ చివరాఖరికి ప్రజా యుద్ధనౌక గద్దర్ కూతురికి దక్కింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు వెన్నెల నివాసానికి చేరుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెన్నెల మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన కేంద్ర నాయకులకు రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుతానని ఆమె తెలిపారు అధిష్టానం ఆదేశాల తీసుకొని ప్రచారానికి ముందుకు సాగుతాను తెలిపారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Latest articles

More like this