HomeNewsవేములవాడలో ఈటలకు షాక్.. బండిదే పైచేయి...తుల ఉమకు టికెట్ కట్

వేములవాడలో ఈటలకు షాక్.. బండిదే పైచేయి…తుల ఉమకు టికెట్ కట్

Published on

వేములవాడ బీజేపీలో టికెట్ టెన్షన్ నెలకొంది. బండి సంజయ్ దే పై చేయిగా మారింది. తొలుత బీజేపీ తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ వికాస్ రావుకు టికెట్ కేటాయించాలనడంతో బీజేపీ అధిష్టానం సందిగ్ధంలో పడిపోయింది. నేడు మొత్తానికి టెన్షన్ అయితే వీడింది. బీజేపీ అభ్యర్థి వికాస్ రావు నామినేషన్ వేశారు.

ముందు తుల ఉమను బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించి.. చివరి రోజు నిర్ణయాన్ని మార్చుకోవడంతో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఆ స్థానం నుంచి తుల ఉమ నామినేషన్ కూడా వేసేశారు. అయితే తాజాగా వికాస్‌రావుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ బీఫామ్ ఇవ్వడం గమనార్హం. దీంతో తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై తుల ఉమ కంట తడిపెట్టారు. వికాస్‌రావుకి టికెట్‌పై బండి సంజయ్ గట్టిగా పట్టుబట్టడంతో అధిష్టానం మార్పు చేయక తప్పలేదు. వికాప్ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు.

Latest articles

More like this