HomeNewsAndhra Pradeshపల్నాడు జిల్లాలో టెన్షన్.. దండా నాగేంద్ర భార్య రోడ్డుపై బైఠాయింపు

పల్నాడు జిల్లాలో టెన్షన్.. దండా నాగేంద్ర భార్య రోడ్డుపై బైఠాయింపు

Published on

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి పియస్ నుండి వైసిపీ బహిష్కృత నేత దండా నాగేంద్ర ను పోలీస్ వాహనంలో తరలించారు. నాగేంద్రను వివిధ ప్రాంతాలకు తిప్పుతున్న పోలీస్ వాహనం వెంబడించారు భార్య,బంధువులు. భృగుబండ సమీపంలో పోలీస్ వాహనం అడ్డుకున్న నాగేంద్ర భార్య అనూష అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ వాహనం ఎదుట బైఠాయించిన నాగేంద్ర భార్యకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడకు తరలిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest articles

More like this