HomeNewsAndhra Pradeshఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దుర్మరణం

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దుర్మరణం

Published on

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దుర్మరణం పాలయ్యారు. అంగన్ వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ దగ్గర ఆయన కారు ఎదురుగా వస్తున్న కారుని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. భీమవరంలో ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనకు మద్ధతు తెలియజేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్ధిగా ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి సాబ్జీ గెలుపొందారు.ఎమ్మెల్సీ సాబ్జీ లేరన్న వార్త ఆయన కుటుంబసభ్యులను, ఉపాధ్యాయుల్ని కలిచి వేసింది. ఎమ్మెల్పీగా అందరికీ అందుబాటులో ఉండే సాబ్జీ దుర్మరణం పాలవడం పట్ల రాజకీయనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

More like this