HomeNewsకూకట్ పల్లి కాంగ్రెస్ లో ఆందోళనలు

కూకట్ పల్లి కాంగ్రెస్ లో ఆందోళనలు

Published on

కూకట్ పల్లి కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ తారస్థాయికి చేరింది.40 యేండ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తే పంగ నామాలు పెట్టారు అంటూ గొట్టిముక్కల వెంగళ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో గొట్టిముక్కల వెంగల్ రావు వున్నారు. అది టీపీసీసీ కాదు అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని టిటిడిపి అని ఆరోపించారు. దశాబ్దాల నుండి పార్టీలో ఉన్నవారికి కనీస గుర్తింపు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో లేదు. కార్యకర్తలుగా జెండా పట్టిన వారికి కనీస గుర్తింపు లేదు. కష్టకాలంలో అండగా ఉంటే ఇదేనా మాకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేదన చెందారు. మమ్ములను నమ్ముకున్న క్యాడర్ ను నట్టేటా ముంచారు. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో అందలం ఎక్కించారని వాపోయారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు నచ్చిన వారికి ..ఆయనలాగా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చి మాలాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులకు మొండి చేయి చూపారు. గతంలో కాంగ్రెస్ అంటే నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అమ్మకం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, 40 ఏండ్ల నుండి పార్టీని నమ్ముకున్న మాకు తడి గుడ్డలతో గొంతు కోశారని అన్నారు.ప్యారచుట్ లీడర్లకు టికెట్లు ఇస్తున్నారు తప్ప…..పార్టీ పిల్లర్లుగా పని చేసిన మాకు టికెట్ల ఇవ్వకుండా రేవంత్ కోసం చేశారని అన్నారు. ఓట్లు మావి సీట్లు మివా అంటూ నిలదిసారు. అది స్క్రీనింగ్ కమిటీ లా వ్యవహరించలేదు…. …..బ్యాంకింగ్ కమిటీ లా వ్యవహరిస్తోంది. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారు తప్ప ప్రజాబలం ఉన్నవారికి టికెట్లు ఇవ్వడం లేదు అంటూ ఆందోళనలు చేసారు.

Latest articles

More like this