HomeNewsకేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. మందకృష్ణ మాదిగ అమ్ముడుపోయాడు

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. మందకృష్ణ మాదిగ అమ్ముడుపోయాడు

Published on

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏపాల్ సంచలనం అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మందకృష్ణ మాదిగపై విరుచుకుపడ్డారు.పార్టీ సింబల్‌పై ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగపై ధ్వజమెత్తారు. ‘‘ఈ దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారింది. మందకృష్ణ మాదిగ మోదీకి అమ్ముడు పోయారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయి. మందకృష్ణను నా పార్టీలో చేరమంటే రూ. 25 కోట్లు అడిగారు. మోదీని ఘోరమైన తిట్లు తిట్టిన మందకృష్ణ మాదిగ.. ఇప్పుడు మోదీ దేవుడు అని అంటున్నారు. ఒక రాజ్యసభ ఎంపీ సీటు ఇస్తారని మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు.

Latest articles

More like this