HomeNewsNationalలెప్చాలో సైనికులతో దీపావళి జరుపుకున్న మోడీ

లెప్చాలో సైనికులతో దీపావళి జరుపుకున్న మోడీ

Published on

దీపావళి పండుగకు ప్రధాని మోడీ ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు. అక్కడున్న దేశ భద్రతా బలగాలతో ప్రధాని దీపావళి వేడుకులు జరుపుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘మన ధైర్యమైన భద్రతా దళాలతో దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నాను.’’ అని ట్వీట్ చేశారు. శనివారం దేశ ప్రజలందరికీ మోదీ దీపావళి సందేశం ఇచ్చారు. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోదీ అందరూ అద్భుతమైన ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

Latest articles

More like this