HomeNewsతెలంగాణ సాగునీటి చరిత్రలో కీలక ఘట్టం

తెలంగాణ సాగునీటి చరిత్రలో కీలక ఘట్టం

Published on

తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం జరగనుంది..కృష్ణా జలాలతో పాలమూరు పాదాలను అభిషేకించనుంది…ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు సాకారం అయితే పాలమూరులో బంగారు పంటలు సాధ్యం అవుతాయని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మారతాయని అంటున్నారు.

Latest articles

More like this