HomeNewsNationalకోవిడ్ కొత్త వేరియంట్... ఐదుగురి మృతి

కోవిడ్ కొత్త వేరియంట్… ఐదుగురి మృతి

Published on

దేశంలో మరోసారి మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్‌ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

వివరాల ప్రకారం.. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాలు కోవిడ్‌ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది. అలాగే, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌లను సిద్దంగా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే, పాజిటివ్‌ శాంపిల్స్‌ను జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని కోరింది. ఇక, జెన్‌-1 వేరియంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. అయితే, ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్‌ బయటపడింది. ఈ వేరియంట్‌ కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు. 

Latest articles

More like this