HomeNewsఇందిరమ్మ ఇళ్లు ఎవరికి ఇస్తారంటే?

ఇందిరమ్మ ఇళ్లు ఎవరికి ఇస్తారంటే?

Published on

రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్బింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు హామీలు నేరవేర్చిన రేవంత్ సర్కార్ మరో నాలుగింటిపై కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రేషన్ కొత్త కార్డులతోపాటు ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అర్హులైన పేదలను గుర్తించి ఈ పథకం అందజేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ మేరకు లబ్ది దారులకు ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిన ప్రభుత్వం డిసెంబర్ 28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేయాలని, 2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం నిధులు సమకూరుస్తామని, లబ్ది దారు కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు రేవంత్‌ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఇక సెకండ్ ఫేజ్‌లో సొంత స్థలం లేని వారికి ఇళ్ల పట్టాలు కేటాయించిన తర్వాతే ఇంటి నిర్మాణం కోసం నిధుల మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఇళ్ల డిజైన్‌ విషయంలో ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా ఇప్పటివరకూ 3 డిజైన్లను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు కాకుండా ఈసారి బాత్ రూమ్ తదితర ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన కుటుంబాల కోసం కూడా ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఇళ్ల నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించబోతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఏర్పడిన గందరగోళం ఇందులో జరగదని, పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబాసుపాలుకాదన్నారు.

Latest articles

More like this