HomeNewsమహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో రష్

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో రష్

Published on

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆరుహామీల అమలు ప్రారంభం అయింది. సోనియాగాంధీ బర్త్ డే అయిన డిసెంబర్ 9వ తేదీన ప్రారంభం అయిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ మునిశేఖర్‌ వివరించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్‌ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

Latest articles

More like this