HomeNewsమేరీ మాటి.. మేరా దేశ్ లో పాల్గొనాలి

మేరీ మాటి.. మేరా దేశ్ లో పాల్గొనాలి

Published on

దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం మేరీ మాటి.. మేరా దేశ్ కార్యక్రమం కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 75 సంవత్సరాల ఆజాద్ కీ అమృత్ మహోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ చేపట్టారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ మట్టి సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలి. స్వాతంత్రం కోసం పోరాడిన మహా నేతల ఇండ్లకు వెళ్ళి మట్టిని సేకరించాలి. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ముగుస్తుంది. కర్తవ్య పథ్ లో ప్రధాని మోడీ స్వయంగా ఈ కళశాలను స్వీకరిస్తారు. ఈ మట్టితోనే ఢిల్లీ లో అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామం కావాలని అయన పిలుపు నిచ్చారు.

Latest articles

More like this