HomeNewsకాంగ్రెస్ పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్ పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

Published on

సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన బీఆర్‌ఎస్ లీగల్ టీం.. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది.. బీఆర్‌ఎస్‌ను కించపరిచే విధంగా కాంగ్రెస్ యాడ్స్‌ను ఆపాలని మరోసారి ఫిర్యాదు చేసింది లీగల్ టీం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం జరిగిందని, ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారని సోమాభరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Latest articles

More like this