HomeNewsరాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Published on

వివాదాస్పద వ్యాఖ్యలు, పీడీ యాక్ట్ నేపథ్యంలో బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏంచేస్తారోనని తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆయన పార్టీ మారతారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై తాజాగా సెక్యులర్ పార్టీలపై ఆయ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం పోతున్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైపు చూడనన్నారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలన్నదే నా లక్ష్యం. బీజేపీ గనుక నాకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయాలను పక్కన పెట్టేస్తా.. హిందూ రాష్ట్రం కోసం పనిచేసుకుంటా. సరైన టైంలో నాపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేస్తుందని భావిస్తున్నా. ఆ నమ్మకం నాకుంది అన్నారు రాజాసింగ్. అంతేకాదు కేసీఆర్ గోషామహల్ టికెట్ గురించి ఆలోచించాలంటే ఎంఐఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. గోషా మహల్ బీఆర్ఎస్ అభ్యర్థి దారుసలాం నుంచి ఎంపికచేయబడతాడు అన్నారు రాజాసింగ్.

Latest articles

More like this