HomeNewsమాదాపూర్ లో బీజేపీ డివిజన్ కార్యాలయం ప్రారంభించిన గజ్జెల యోగానంద్

మాదాపూర్ లో బీజేపీ డివిజన్ కార్యాలయం ప్రారంభించిన గజ్జెల యోగానంద్

Published on

శేరిలింగంపల్లిలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జెల యోగానంద్ తన ప్రచారంలో దూకుడు పెంచారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటర్లకు, స్థానిక ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు డివిజన్ కార్యాలయాలు ప్రారంభించారు. ఇప్పటికే రెండు కూకట్ పల్లి, చందానగర్ లో ఓటర్లకు అందుబాటులో ఉన్న గజ్జెల యోగానంద్ తాజాగా మరో కార్యాలయం ప్రారంభించారు. సైబర్ టవర్స్ ఎదురుగా బంధన్ బ్యాంకు పైన ఒక కార్యాలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ డివిజిన్లకు చెందిన ఓటర్లు, స్థానిక ప్రజలు ఈ కార్యాలయంలో తమ సమస్యలు తెలియచేయవచ్చు.

రాబోయే ఎన్నికల్లో తన విజయం ఖాయమని, 9 ఏళ్ళ పాలనలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసింది ఏమీ లేదన్నారు గజ్జెల యోగానంద్. తెలుగు పాపులర్ టీవీతో మాట్లాడుతూ.. తాను నిర్వహిస్తున్న పాదయాత్రలో అనేక సమస్యలు తమకు తెలిశాయన్నారు. తాను పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులకు తెలిపామన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయాల వికేంద్రీకరణ చేపట్టామని. ఈ కార్యాలయాల ద్వారా ఓటర్లు తమ ఓటు ఎక్కడుందో తెలుసుకోవచ్చన్నారు ప్రత్యేక పూజల అనంతరం కార్యాలయం అందుబాటులోకి తెచ్చారు. ప్రధాని మోడీ చేపట్టిన కార్యక్రమాలు సత్పలితాలు ఇస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రధాని అవుతారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గజ్జెల యోగానంద్ ధీమా వ్యక్తం చేశారు. . ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest articles

More like this