HomeNewsAndhra Pradeshగన్నవరం ఎమ్మెల్యే వంశీ కాన్వాయ్ కి ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వంశీ కాన్వాయ్ కి ప్రమాదం

Published on

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. వాహనశ్రేణిలో వెనక నుంచి ఒక వాహనాన్ని మరొక వాహనం ఢీ కొట్టింది. ఎమ్మెల్యే వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాస్త దెబ్బతిన్న వాహనాన్ని వదిలి.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మిగిలిన వాహనాలతో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ గన్నవరం రాజకీయం ఇప్పటికే హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే.

Latest articles

More like this