HomeNewsGNITలో ఘనంగా 19వ గ్రాడ్యుయేషన్, ప్లేస్ మెంట్ డే

GNITలో ఘనంగా 19వ గ్రాడ్యుయేషన్, ప్లేస్ మెంట్ డే

Published on

గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ లో 19 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే 2023 ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం లోని గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ వారు 19 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే ను ఆగస్టు, 19, 2023 శనివారం రోజున నిర్వహించారు. గురు నానక్ ఇనిస్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (జి.ఎన్.ఐ.టి.సి) మరియు గురు నానక్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (జి.ఎన్.ఐ.టి) నుండి సుమారు 1497 మంది పట్టభద్రులైన విద్యార్థులకు విద్యాసంస్థల వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు అసోసియేట్ డైరెక్టర్లు మెరిట్ సర్టిఫికెట్స్ ను, డిగ్రీ పట్టాలను బహుకరించారు. బాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లకు గాను ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు పొందిన గ్రాడ్యుయేట్లకు 32 గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ను బహుకరించారు.

సుమారు 120 కు పైగా బహుళ జాతి కంపెనీలలో ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన జి.ఎన్.ఐ.టి.సి. నుండి 944, జి.ఎన్.ఐ.టి నుండి 364 మరియు జి.ఎన్.ఐ.పి నుండి 42 కలిపి మొత్తం 1350 మంది విద్యార్థులకు గురు నానక్ విద్యాసంస్థల యాజమాన్యం వారు ఉద్యోగ నియామక పత్రాలను, ప్రశంసా పత్రాలను అందచేశారు. వివిధ సంస్థలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల జాబితా ఈ విధంగా ఉంది. సి టి సి 146, దూత్ ట్రాన్స్మిషన్స్ 110, వేల్యూ మొమెంటం 93, టి సి ఎస్ 77, ఎల్ టి ఐ మైండ్ ట్రీ 53, మొదలైనవి. ఈ సంవత్సరం అత్యధికంగా 27 లక్షల వార్షిక వేతనాన్ని వేల్యూ లాబ్స్ సంస్థ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు పొందారు. ఎంబీఏ విద్యార్థులు అత్యధికంగా 12 లక్షలు మరియు ఫార్మసీ విద్యార్థులు 8.5 లక్షలు గరిష్ట వార్షిక వేతనంగా బైజూస్ సంస్థ ద్వారా పొందారు.

గురు నానక్ విద్యా సంస్థల వైస్-చైర్మన్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ ఈ విద్యా సంస్థలు బలమైన శక్తిగా ఎదగాలని, ఈ సంస్థ నుండి ఉత్తీర్ణులైన విద్యార్థుల నిబద్ధత మరియు నైపుణ్యాల నుండి దేశం ప్రయోజనం పొందాలని ఆయన అన్నారు. విద్యార్థులందరూ భారత జాతి నిర్మాణంలో భాగస్థులు కావాలని ఆకాంక్షించారు.

విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. సైనీ మాట్లాడుతూ, అర్హులైన పట్టభద్రులందరూ ప్రతిష్టాత్మకమైన బహుళ జాతి సంస్థలలో ప్లేసెమెంట్స్ పొందినట్లు చెప్పారు. గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రతి విద్యార్థి జీవితంలో మరపురాని సంతోషకరమైన రోజని, గురు నానక్ విద్యా సంస్థలలో నుండి గ్రాడ్యుయేట్ ఐన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, బాధ్యతాయుతంగా విలువలు కలిగిన గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ మరియు గురు నానక్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ గా సేవలందిస్తూ నేక్ ఏ ప్లస్ గ్రేడ్ మరియు ఎన్.బి.ఏ అక్రెడిటేషన్ పొందినవని అన్నారు.జి.ఎన్.ఐ.టి.సి. డైరెక్టర్ డాక్టర్ కడుగంటి వెంకటరావు, జి.ఎన్.ఐ.టి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాధ రెడ్డి, జి.ఎన్.ఐ.టి.సి. జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. పార్థసారధీ, జి.ఎన్.ఐ.టి.సి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషి సయాల్, డీన్ ఆర్ & డి డాక్టర్ ఎస్ వి రంగనాయకులు మరియు ఇతర అసోసియేట్ డైరెక్టర్లు, హెచ్ ఓ డి లు, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Latest articles

More like this