HomeNewsAndhra Pradeshత్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నా..సీఎం జగన్

త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నా..సీఎం జగన్

Published on

విశాఖ పర్యటనలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ చివరి కల్లా పరిపాలన విశాఖనుంచి సాగుతుందన్నారు. ఋషికొండ ఐటీ హిల్స్ కు చేరుకున్న జగన్.. ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్‌ సెంటర్, బీచ్ క్లీనింగ్ యంత్రాలు ప్రారంభించారు. పరవాడ, అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలు ప్రారంభించారు ముఖ్యమంత్రి.. ఐదు గంటల పాటు సీఎం టూర్ సాగింది. నేను విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నాను.. డిసెంబర్‌లోపు మారతాను.. విశాఖ నుంచే పరిపాలన జరగబోతోంది.. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది.. ఏపీలో అతిపెద్ద నగరం విశాఖ.. ఇప్పటికే ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారింది.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. కంపెనీలు ఒక్క ఫోన్ చేస్తే వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాం అన్నారు జగన్.

Latest articles

More like this